Sat Jan 31 2026 10:35:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ లో మళ్లీ పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 154 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 154 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,73,730 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,452 మంది మరణించారు.
కోలుకున్న వారు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,57,156 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,122 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,05,70,020 నమూనాలను పరీక్షించారు
Next Story

