Sat Dec 06 2025 08:52:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 135 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 135 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,76,212 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,486 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,60,400 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,326యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,10,98.568 నమూనాలను పరీక్షించారు
Next Story

