Mon Apr 29 2024 12:11:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు మూడో రోజు జగన్ పర్యటన
కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. 9 గంటలకు పులివెందులోని సీఎస్ఐ చర్చికి సీఎం జగన్ చేరుకుంటారు
కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్ఐ చర్చికి సీఎం జగన్ చేరుకుంటారు. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వివిధ కార్యక్రమాల్లో...
వరసగా మూడు రోజుల పాటు జగన్ తన సొంత జిల్లాలో పర్యటించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు పంపారు. ప్రారంభోత్సవాలు జరిపారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈరోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళతారు.
Next Story