Tue Mar 17 2026 00:17:03 GMT+0530 (India Standard Time)
మూడు రాజధానుల కొత్త బిల్లులపై కసరత్తు?
మూడు రాజధానుల బిల్లుల అంశంపై త్వరలో క్లారిటీ రానుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అధికారులతో దీనిపై సమీక్షించారు

మూడు రాజధానుల బిల్లుల అంశంపై త్వరలో క్లారిటీ రానుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అధికారులతో దీనిపై సమీక్షించారు. ఈసారి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బిల్లుల రూపకల్పనలో జాగ్రత్తలు వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు. వీలయినంత త్వరగా బిల్లులను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
న్యాయనిపుణుల....
హైకోర్టు కూడా దీనిపై విచారణను వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా జగన్ ప్రభుత్వం ఉంది. బిల్లులు రూపొందాక పూర్తి స్థాయిలో న్యాయనిపుణుల పరిశీలన అనంతరమే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు.
Next Story

