Fri Dec 05 2025 13:55:38 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ నమూనా స్మార్ట్ రేషన్ కార్డులు విడుదల చేశారు. మొదటి విడత ఈ నెల 25వ తేదీ నుంచి 9 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంపిణీ చేస్తామని చెప్పారు.
నాలుగు విడతలుగా...
రెండో విడత ఈ నెల 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, మూడో విడత 06.09.2025 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, నాలుగో విడత 15.09.2025 నుంచి 8 జిల్లాలు బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో యాప్ ఏర్పాటు చేసామని అంతేకాకుండా డాష్ బోర్డు ద్వారా స్మార్ట్ కార్డు వివరాలు కూడా చూడొచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వలస వెళ్లిన వారు నమోదు చేసుకున్న రేషన్ షాపు వద్దనే స్మార్ట్ కార్డు తీసుకోవాలని, ఇప్పటికే రేషన్ ను ఎక్కడైనా తీసుకునే విధంగా పోర్టబులిటీ చేయడం జరిగిందన్నారు.
Next Story

