Sat Apr 27 2024 00:02:59 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదయింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. తన సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేసిింది. బీకాం పూర్తయినట్లు తప్పుడు సర్టిఫికేట్ పెట్టి ప్రయోజనాలు పొందారని అశోక్ బాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
నకిలీ సర్టిఫికేట్ పెట్టి....
అశోక్ బాబు ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే సర్వీస్ రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఏళసీటీవలో ఉన్నప్పుడు ఫోర్జరీ సమాచారం ఇచ్చారని ఆయన పై ఆరోపణలున్నాయి. బీకాం చదవకపోయినా నకిలీ సర్టిఫికేట్ పెట్టారని ఆరోపణలున్నాయి. సీఐడీకి అప్పగించాలని లోకాయుక్త ఆదేశంతో ఆయనపై కేసు నమోదయింది.
- Tags
- ashok babu
- mlc
Next Story