Thu Dec 18 2025 07:38:08 GMT+0000 (Coordinated Universal Time)
రామోజీని విచారిస్తున్న ఏపీ సీఐడీ
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో రామోజీరావును, ఆయన కోడలు చెరుకూరి శైలజను విచారించేందుకు సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు

మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో రామోజీరావును, ఆయన కోడలు చెరుకూరి శైలజను విచారించేందుకు సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ కి చేరుకున్న 200 మంది ఏపీ సిఐడి పోలీసులు చేరుకున్నారు. రామోజీరావు, శైలజా కిరణ్లను ఈరోజు విచారించేందుకు రానున్నామని ముందుగానే ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సిఐడి పోలీసులు ఏపీ సిఐడి పోలీసులు భారీ బందోబస్తు మధ్య మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎండి శైలజలను విచారిస్తున్నారు.
ఇద్దరినీ ఒకే చోట...
జూబ్లీహిల్స్ లోని శైలజ కిరణ్ ఇంటికి చెరుకూరి రామోజీరావు చేరుకున్నారు. ఇద్దరినీ అక్కడే విచారించనున్నారు. ఇటీవల ఏపీలో మార్గదర్శి కార్యాలయంలో జరిపిన సోదాల్లో పలు అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లభించడంతో వీరిని ఏపీ సీఐడీ పోలీసులు విచారించనున్నారు.
Next Story

