Thu Dec 18 2025 18:11:34 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారిని చూసి కారు దిగిన జగన్
భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ కు ఒక చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు

జగన్ జిల్లాల పర్యటనలో ఎందరో చిన్నారులను ఆదుకున్నారు. ఎందరికో ఆయన పర్యటన సందర్భంగా చికిత్సకు నిధులు కేటాయిస్తున్నారు. జగన్ జిల్లాల పర్యటనలో దీర్ఘకాల వ్యాధితో ఇబ్బంది పడే చిన్నారులను తీసుకు వచ్చి జగన్ కు కన్పించేలా నిలుచుని ఉంటారు. వారిని చూసిన జగన్ ఆగి వారితో మాట్లాడి వారి బిడ్డలకు అనారోగ్యం వివరాలను తెలుసుకుని సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తుంటారు. మెరుగైన వైద్యం వారికి అందేలా జగన్ చర్యలు తీసుకుంటారు.
మెరుగైన వైద్యం...
నిధులతో సంబంధం లేకుండా వారు తిరిగి ఆరోగ్యవంతులయ్యేందుకు అవసరమైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే పింఛన్లు కూడా అక్కడికక్కడే మంజూరు చేయడం జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జరుగుతున్నదే. తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ కు ఒక చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. వెంటనే తన సిబ్బందికి వారిని హెలిప్యాడ్ వద్దకు తీసుకు రావాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వారి వినతిని విన్న జగన్ వెంటనే పాపకు మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చూడాలని ఆదేశించారు.
Next Story

