Tue Jan 20 2026 11:40:59 GMT+0000 (Coordinated Universal Time)
తుపాను పై నేడు జగన్ సమీక్ష
మాండూస్ తుపాన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు

మాండూస్ తుపాన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమీక్షకు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇటీవల మాండూస్ తుపాను కారణంగా నష్టపోయిన పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం గురించి కూడా తెలుసుకోనున్నారు.
పంట నష్టం....
పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలతో పాటు ఇళ్లు కోల్పోయిన బాధితుల వివరాలను కూడా ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించనున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ అధికారులతో నేడు చర్చించనున్నారు.
Next Story

