Tue Jun 06 2023 12:07:51 GMT+0000 (Coordinated Universal Time)
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై అసెంబ్లీలో జగన్
స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ అతి పెద్ద కుంభకోణమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు

స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ అతి పెద్ద కుంభకోణమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఓ వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదుతో ఈ స్కాం బయటపడిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ కు వందల కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆయన మనుషులు రూ.370 కోట్లు తినేశారన్నారు. అనేక షెల్ కంపెనీల ద్వారా డబ్బులు చేతులు మారి మనీ లాండరింగ్ జరిగి వీరి చేతుల్లోకి వచ్చిందని జగన్ తెలిపారు.
ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు...
2018 జూన్ లో అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఒక వ్యక్తి ఏసీబీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం గురించి వెలుగులోకి వచ్చిందని జగన్ అన్నారు. ఆయన ఫిర్యాదు అనంతరం ఏసీబీ విచారణ మొదలుపెట్టారని జగన్ సభకు వివరించారు. కానీ, ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాల అనుసారం వారు ఆ ఫైల్ ను పక్కన పెట్టారని, అంటే వారిని ఎవరు ఆపారు అనే విషయం తెలియాల్సి ఉందని జగన్ అన్నారు. ఇది జరిగిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్ అన్నీ మాయం చేశారని జగన్ తెలిపారు. ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక పొరపాటును చేస్తాడని, కాబట్టి, వివిధ శాఖల్లోని షాడో ఫైల్స్ ద్వారా మేం ఈ తతంగాన్ని మొత్తం తవ్వడం ప్రారంభించామని జగన్ వివరించారు.
Next Story