Thu May 02 2024 23:18:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ముస్లిం పెద్దలతో జగన్
ముస్లిం సామాజికవర్గం పెద్దలతో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు
ముస్లిం సామాజికవర్గం పెద్దలతో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సామాజికవర్గంలో ఉన్న పెద్దలతో పాటు, రాష్ట్రంలోని దర్గాల బాధ్యులు, మతగురువులు హాజరవుతున్నారు. ప్రధానంగా ముస్లిం సామాజికవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
సమస్యలపై సమగ్రంగా...
పెద్దలతో చర్చించిన తర్వాత ముస్లిం సామాజికవర్గానికి ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రణాళికను రూపొందించనున్నారు. మరిన్ని సేవలు ఆ సామాజికవర్గానికి అందించాలన్న లక్ష్యంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మత పెద్దల సలహాలతో సమగ్ర ప్రణాళికను రూపొందించి వాటికి అవసరమయ్యే నిధులను కేటాయించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story