Sat Dec 06 2025 15:28:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : 12న విజయోత్సవ ర్యాలీలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది సందర్భంగా ఈ నెల 12వ తేదీన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది సందర్భంగా ఈ నెల 12వ తేదీన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ ను కోరారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారు.
అదే రోజు సాయంత్రం...
ఈ నెల పన్నెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలకు కూటమి చేస్తున్న మంచి చెప్పడంతోపాటు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
Next Story

