Thu Dec 18 2025 22:56:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : బాపట్లలో అనుకోని ఘటన..చంద్రబాబును ప్రశ్నించిన లోకేష్
బాపట్ల లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు

బాపట్ల లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలిచారు. తర్వాత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
లోకేష్ ప్రశ్నకు...
విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగేలా చదువులు చెప్పాలంటూ టీచర్లను చంద్రబాబు కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ తన తండ్రి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ప్రశ్నించారు. తమ స్కూల్ లో జరిగిన పేరెంట్ - టీచర్ మీట్ కు ఎప్పుడూ హాజరు కాలని అన్నారు. దీంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు.
Next Story

