Chadrababu : నేతలు చంద్రబాబు చేయి దాటి పోయారా? గాడిన పెట్టేవారు లేరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలను చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలను చేపట్టారు. అయితే గత మూడు దఫాలుగా ఇలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొనలేదు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు చేయి దాటి పోయే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. కూటమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తాను వస్తుంటే వాటిని చెడగొట్టేందుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ లైన్ తో పాటు నాయకత్వంపై కొంచెం కూడా భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. 1999 లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా దగ్గర నుంచి చూసిన వారికి ఇది అర్థమవుతుంది. నాడు మంత్రులు మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నా నాటి సీపీఆర్వో విజయ్ కుమార్ ను అడిగి పర్మిషన్ తీసుకోవాలి. అంటే చంద్రబాబు అనుమతితోనే మీడియా సమావేశాలు, అందులో మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువగా టీడీపీలో కనిపిస్తుంది.

