సంక్రాంతికి ఏపీకి 30 లక్షల మంది వచ్చారు : చంద్రబాబు
ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపా

ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయన్నారకు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారన్న చంద్రబాబు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషదాయకమని అన్నారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలియచేస్తున్నాని, గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని, 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చంద్రబాబు తెలిపారు.

