Mon Dec 29 2025 19:05:18 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ చేరుకున్న చంద్రబాబు
పోలీసులు చంద్రబాబును బాధిత యువతి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ ప్రభుత్వాస్పత్రి..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు చంద్రబాబును బాధిత యువతి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అక్కడున్న టిడిపి మహిళా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతానని చెప్పినా వినకుండా.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరికి పోలీసులు వాసిరెడ్డి పద్మను బాధితురాలి వద్దకు తీసుకెళ్లారు.
Next Story

