Thu Jan 29 2026 11:58:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి మరో మూడు వైద్య కళాశాలలు
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లా పిడుగు రాళ్ల, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, విశాఖ జిల్లాలోని పాడేరులో కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మూడు జిల్లాల్లో....
రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి భారతి పవార్ ఈ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పదమూడు వైద్య కళాశాలలున్నాయని, మరో మూడు కళాశాలలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story

