Fri Dec 05 2025 13:19:46 GMT+0000 (Coordinated Universal Time)
Big News : ఏఆర్ డెయిరీకి నోటీసులు.. కేంద్ర సీరియస్
తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీిరియస్ అయింది. లడ్డూ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీిరియస్ అయింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏఆర్ డెయిరీకి నోటీసులు పంపుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ ఏఆర్ డెయిరీకి ఎఫ్ఎస్ఎస్ఐ(FSSI) నోటీసులు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన...
తిరుమల లడ్డూ తయారీలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. అయితే ఈ నెయ్యిలో జంతువుల నూనె కలిసిందన్న ఆరోపణలతో ఇప్పటి రవరకూ రాష్ట్ర ప్రభుత్వమే చర్యలను ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి నోటీసులు పంపడంతో లడ్డూ వివాదం మలుపు మరింత తిరిగే అవకాశముంది.
Next Story

