Sun Mar 15 2026 18:21:32 GMT+0530 (India Standard Time)
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరద సాయం...ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ సాయాన్ని ప్రకటించింది. ఇటీవల వరదలతో రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ సాయాన్ని ప్రకటించింది. ఇటీవల వరదలతో రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి. తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 39 మంది వరకూ వరదల కారణంగా మరణించారు.
వరద నష్టంతో...
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాబాద్ జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఏపీలో కేంద్ర బృందం పర్యటించి నష్టం వివరాలను సేకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే రెండు రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్ల రూపాయలు భారీ సాయాన్ని ప్రకటించింది.
Next Story

