Thu Jan 29 2026 18:21:17 GMT+0000 (Coordinated Universal Time)
రిమాండ్ పొడిగింపు
వైఎస్ వివేక హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డి రిమాండ్ను సీీీబీఐ కోర్టు పొడిగించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డి రిమాండ్ను సీీీబీఐ కోర్టు పొడిగించింది. వివేకా హత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే గతంలో వారం రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు.
సీబీఐ కోర్టు ఆదేశాలతో...
అయితే తాజాగా సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డికు వచ్చే నెల 2 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో సీబీఐకి జులై నెలాఖరు వరకూ విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విచారణను సీీబీఐ అధికారులు ముమ్మరం చేశారు. మరికొందరిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశముంది.
Next Story

