Andhra Pradesh : నాడు వైసీపీ... నేడు .. టీడీపీ మారే అవకాశం లేదా?
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. రిజర్వ్ డ్ నియోజకవర్గాలపై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. రిజర్వ్ డ్ నియోజకవర్గాలపై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది. అది వైసీపీ కావచ్చు. టీడీపీ కావచ్చు. మరేదైనా పార్టీ కావచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదిదే. రాజ్యాంగం ప్రకారం రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో వారిని మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉన్నందున వారిని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపిక చేస్తున్నారు. గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అగ్రకులానికి చెందిన నేతల ఆధిపత్యం ఆ నియోజకవర్గాల్లో ఉండటం, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నామమాత్రంగా మిగిలిపోవడం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న తంతు ఇదే. దీనికి ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం వారి వెంట పరుగులు తీస్తారు. గెలిచిన తర్వాత మాత్రం అక్కడ వారిని నామమాత్రంగానే మిగిలేలా చేస్తారు.

