Sat Dec 06 2025 01:54:58 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి బొత్స హట్ కామెంట్స్
మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. అంతే తప్ప అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని ఆయన మరోసారి తెలిపారు.
మనిషి పెరిగాడు కాని...
గతంలో ఇక్కడ అడ్రస్ లేని వ్యక్తి పరిపాలన చేశారని పరోక్షంగా చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై కూడా మండి పడ్డారు. మనిషి పెరిగాడు కాని బుర్ర పెరగలేదన్నారు.
Next Story

