Sat Mar 14 2026 19:12:59 GMT+0530 (India Standard Time)
రోడ్షోలపై నిషేధం : విష్ణు ఫైర్
సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వాస్తవాలకు భిన్నంగా రాజకీయ కోణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రజలు రోడ్లపైకి రాకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విచిత్ర నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
తప్పు చేసిన వారిపై...
తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి తప్పించి, మొత్తం రోడ్ షోలపై నిషేధించడమేంటని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయకుండా ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కు తీసుకోవాలని కోరారు.
Next Story

