Wed Apr 24 2024 12:08:28 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో సోము వీర్రాజు ధర్నా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ జెన్ కో ప్రయివేటీకరణకు నిరసనగా ధర్నాకు దిగారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ జెన్ కో ప్రయివేటీకరణకు నిరసనగా ధర్నాకు దిగారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన ధర్నా చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లో ఏపీ జెన్ కోను ప్రయివేటీకరించకుండా అడ్డుకుంటామని సోము వీర్రాజు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రయివేటీకరించలేదన్నారు. అయినా దానిని విక్రయించే ఆలోచన లేదని సోము వీర్రాజు తెలిపారు.
జెన్ కోను ప్రయివేటీకరణ అడ్డుకుంటాం...
వైసీపీ నేతలు పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రశ్నలు వేస్తారని, ఇక్కడ మాత్రం జెన్ కోను ప్రయివేటీకరిస్తారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు చెప్పేదొకటి చేసేదొకటి అన అన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలపై కక్ష సాధింపు చర్య తగదని సోము వీర్రాజు అన్నారు.
Next Story