Sat Dec 06 2025 04:07:51 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పై సోము ఫైర్
రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు

రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మిర్చి రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. గుంటూరులో జరిగిన రైతు గర్జన సభలో సోము వీర్రాజు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం కింద నిధులు మంజూరు చేస్తే ఆ బీమాను కూడా అమలు పర్చడం లేదు సోము వీర్రాజు ఆరోపించారు.
ధాన్యం అమ్ముకున్న రైతులకు..
ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇంతవరకూ డబ్బులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఘోరంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావులు పాల్గొన్నారు.
Next Story

