Fri Mar 27 2026 10:15:12 GMT+0530 (India Standard Time)
సీమలో పర్యటన.. అందుకేనట
రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది.

రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈరోజు బనగానపల్లిలో వీర్రాజు పర్యటించనున్నారు. అలాటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొంటారు.
పార్టీ బలోపేతంపై...
అనంతరం పార్టీని బలోపేతం చేయడంపై నాలుగు జిల్లాలకు సంబంధించిన కీలక నేతలతో సోము వీర్రాజు సమవేశం కానున్నారు. ఈ సమావేశంలో సీమ ప్రాంత సమస్యలపై రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమ కార్యాచరణపై కూడా సోము వీర్రాజు చర్చించనున్నారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

