Sun Mar 15 2026 16:36:20 GMT+0530 (India Standard Time)
బాలినేని ఆగ్రహం.. సొంత పార్టీ నేతలే?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను కొందరు పార్టీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అన్నారు. ఎవరు చేస్తున్నారో తనకు తెలుసనని, వారి సంగతి తేలుస్తానని బాలినేని శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు.
పవన్ ర్విక్టెస్ట్ తోనే....
పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ తోనే కేసులు ఉపసంహరించుకున్నామని బాలినేని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారితో కొందరు తమ పార్టీకి చెందిన వారే టచ్ లో ఉన్నారన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Next Story

