Fri Dec 05 2025 17:38:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బాలకృష్ణ మౌన దీక్ష
నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటించనున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మౌనదీక్ష చేపట్టనున్నారు

నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటించనున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టనున్నారు. ఇటీవల కొత్త జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం హిందూపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించలేదు. సత్యసాయి జిల్లాగా పేరు పెట్టి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసింది. దీంతో హిందూపురంలో గత వారం రోజుల నుంచి అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి.
ర్యాలీగా వెళ్లి....
బాలకృష్ణ మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నేడు హిందూపురంలో పర్యటిస్తారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ జరిగే ర్యాలీలో బాలకృష్ణ పాల్గొంటారు. అనంతరం మౌనదీక్షలో బాలకృష్ణ పాల్గొంటారు. హిందూపురం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిందని, దానినే జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story

