Fri May 23 2025 02:45:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బిల్ గేట్స్ తో బాబు భేటీ.. సానుకూల స్పందన వచ్చినట్లేనా?
దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహామండలిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఏపీని ఏఐలో అగ్రగామిగా నిలపాలన్నదే తమ ఉద్దేశ్యమని, ఆ మేరకు తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నస్టిక్స్ ను ఏర్పాటు చేయాలని కూడా బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరారు.
ఏపీలో సహకారానికి...
ఈ మేరకు బిల్ గేట్స్ తో తాను సమావేశమయిన విషయాన్ని, 1995లో ఐటీ ఇప్పుడు ఏఐ అంటూ ఎక్స్ లో చంద్రబాబు పోస్టు చేశారు. బిల్ గేట్స్ కు చెందిన సేవాసంస్థలు అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్ బోర్డులు, సామజిక సేవలను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తమ రాష్ట్రాన్ని విద్యలోనూ, వైద్యంలోనూ ఒక హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని చంద్రబాబు బిల్ గేట్స్ ను కోరారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ బిల్ గేట్స్ తో సమావేశం సంతృప్తికరంగా ముగిసిందని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇన్నోవేషన్ పై పరస్పర సహకారాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వామి కావాలని కోరామని చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత బిల్ గేట్స్ ను కలవడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని చంద్రబాబు తెలిపారు.
Next Story