Fri Jan 30 2026 00:20:47 GMT+0000 (Coordinated Universal Time)
దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనవరి నెల ప్రవేశించే సరికి చలి కూడా తీవ్రమయింది. డిసెంబరు నెల చివరి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలయింది.

జనవరి నెల ప్రవేశించే సరికి చలి కూడా తీవ్రమయింది. డిసెంబరు నెల చివరి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోని మినుములూరులో అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెలంగాణలో సిర్పూరు లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంచు దట్టంగా అలుముకుంటుంది.
Next Story

