Tue Feb 03 2026 12:38:49 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు సభ ప్రారంభయిన వెంటనే మృతి చెందిన మాజీ శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. గవర్నర్ ప్రసంగానినిక ధన్యవాదం చెబుతూ పై నేడు చర్చ జరగనుంది. దీంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.
టీడీపీ వాయిదా తీర్మానాన్ని...
కాగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుదలపై చర్చించాలంటూ టీడీపీ నేడు వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. సభకు నిరసనగా టీడీపీ సభ్యులు బయలుదేరి వచ్చారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చించాలని పట్టుబట్టనున్నారు. దీంతో స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

