Wed Jan 28 2026 22:41:11 GMT+0000 (Coordinated Universal Time)
AP Speaker : నేడు అనర్హతపై నిర్ణయాన్ని ప్రకటిస్తారా?
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానన్న నేపథ్యంలో స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు స్పీకర్ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని చెబుతున్నారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు...
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలిగిరి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారించిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

