Tue Jan 20 2026 22:56:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : డీకే తో షర్మిల భేటీ.. అన్ని విషయాలపై క్లారిటీ వచ్చినట్లేనా?
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసంలో వైఎస్ షర్మిల కలిశఆరు. ఆయనతో రాష్ట్ర రాజకీయాల అంశాల గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఏపీలో పార్టీ బలోపేతం, కాంగ్రెస్ లో తన భవితవ్యంపై కూడా డీకేతో షర్మిల చర్చించినట్లు తెలిసింది.
విజయవాడలో...
దీంతో పాటుగా ఈ నెల 8 న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలకు హజరు కావాలని కోరారు. అదేవిధంగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గతంలో డీకే శివకుమార్ ప్రోద్బలంతోనే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
Next Story

