Fri Dec 05 2025 16:05:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు
ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల

అమరావతి : ఏపీలో కరోనా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,941 కరోనా శాంపిళ్లను పరీక్షించగా ఒకే ఒక్క కరోనా కేసు నమోదైనట్లు వెల్లడైంది. విశాఖ జిల్లాలో ఈ ఒక్క కరోనా కేసు నమోదైంది.
ఇదే సమయంలో నలుగురు కరోనా నుంచి కోలుకోగా.. గడిచిన 24 గంటల్లో కరోనా మరణం సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,730గా ఉంది. నేటి వరకూ రాష్ట్రంలో 3,35,05,128 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story

