Fri Dec 05 2025 16:30:45 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,686 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా ఏపీలో 08 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇదే సమయంలో మరో 14 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,599 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,746 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 174 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,69,666 నమూనాలను పరీక్షించారు.
Next Story

