Tue May 07 2024 12:15:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణం సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 661 యాక్టివ్ కేసులుండగా..
అమరావతి : ఏపీలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 12,092 శాంపిళ్లను పరీక్షించగా.. 46 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణం సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 661 యాక్టివ్ కేసులుండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ ఏపీలో 23,18,751 కరోనా కేసులు నమోదవ్వగా.. 23,03,361 మంది దాని నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,729గా ఉంది.
Next Story