Sat Dec 06 2025 10:53:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ ఎన్జీవో ఎన్నికలు
ఏపీ ఎన్జీవో ఎన్నికలు నేడు జగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ప్యానల్ పోటీలో నిలబడింది.

ఏపీ ఎన్జీవో ఎన్నికలు నేడు జగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ప్యానల్ పోటీలో నిలబడింది. మరో ప్యానెల్ ఏదీ పోటీ పడకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నుంచి నెరవేర్చుకోవాలంటే తమకు ఓటేయాలని ప్రచారం చేశారు.
ఏకగ్రీవమేనా?
ఎన్నికల వేళ ప్రభుత్వం మెడల వంచైనా డిమాండ్లను సాధిస్తామని బండి శ్రీనివాసరావు వర్గం చెబుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్లను వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగులు, పెన్షనర్లు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని నేతలు కోరుతున్నారు. గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీవో హోంలో ఎన్నికలు జరగనున్నాయి.
Next Story

