Sun May 05 2024 17:41:31 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆధార్ అప్డేట్ కోసం?
ఏపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నారు. సచివాలయాల్లో ఈ ప్రత్యేక ఆధార్ క్యాంప్ లను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోని వారు 80 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు.
ప్రత్యేక క్యాంప్లు...
వీరి కోసం ప్రత్యేకంగా క్యాంప్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 19,20,21, 23, 24 తేదీల్లో మొదటి విడతగా ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. రెండో విడతలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి పది వతేదీ వరకూ క్యాంప్ లను నిర్వహిస్తారు. అప్డేట్ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.
Next Story