Mon Jun 16 2025 19:41:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా జగన్ ఢిల్లీలో...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈరోజు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈరోజు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అయి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై చర్చించారు. ఈరోజు కూడా జగన్ ఢిల్లీలోనే ఉన్నారు.
ఈరోజు షాను....
ఈరోజు కేంద్రమంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. అమిత్ షాతో రాష్ట్ర విభజన సమస్యలతో పాటు రాజకీయ పరమైన అంశాలను కూడా జగన్ చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story