కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్
కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించారు. శాంతిపురంలో ఏర్పాటు
![Kuppam, YSJagan, JaganMohanReddy, MLCBharath, BharathMLC, Jagan Kuppam, YSJagan, JaganMohanReddy, MLCBharath, BharathMLC, Jagan](https://www.telugupost.com/h-upload/2024/02/26/1594315-mlc-bharath-ysjagan.webp)
కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించారు. శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ భరత్ కు సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని తేల్చి చెప్పారు. భరత్ తో కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని తేల్చి చెప్పారు. పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా... లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్. కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పంనకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్. చిత్తూరు పాలడెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్ అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా? అని ప్రశ్నించారు.