Thu Feb 05 2026 18:36:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎమ్మెల్సీకి తృటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు తృటిలో ప్రమాదరం తప్పింది. ఆయన రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు తృటిలో ప్రమాదరం తప్పింది. ఆయన రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వైసీపీ ప్లీనరీ ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్ వస్తున్న రమేష్ యాదవ్ వాహనం నార్కేట్ పల్లి మండలం గోపాలయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
సురక్షితంగా....
రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం మరో కారుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి రమేష్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారు. రమేష్ యాదవ్ కారు పాక్షికంగా డ్యామేజీ అయింది.
Next Story

