Thu Dec 18 2025 10:17:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పేదలకు లోకేశ్ శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరిలో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.

మంత్రి నారాలోకేశ్ నేడు మంగళగిరిలో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్. పంపిణీ చేయనున్నారు. దీంతో పెద్దయెత్తున లబ్దిదారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
మంగళగిరిలో ఉన్న...
ఉదయం రత్నాల చెరువు - 600 మందికి, మధ్యాహ్నం మహానాడు వద్ద 430 మందికి మొత్తంగా 1030 మంది లబ్దిదారులకు ఈరోజు శాశ్వత ఇంటి పట్టాలు నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరిలో ఉన్న పేదలకు శాశ్వత ఇంటిపట్టాలను మంజూరు చేయడంతో పాటు వారి ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందచేయనుంది.
Next Story

