Mon May 06 2024 01:17:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఇంజినీరింగ్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95.06 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95.06 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సులకు సంబంధిచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,82,496 మంది పరీక్షలకు రావారు. ఇంజనీరింగ్ పరీక్షలో 89.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
కొత్త మార్గదర్శకాలను....
ఈసారి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఈసారి ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజీ లేదు. ర్యాంకుల ప్రాతిపదికనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా అడ్మిషన్లు ఉన్నాయి. ప్రయివేట ఇంజినీరింగ్ కళాశాలల్లో 35 శాతం అడ్మిషన్లను ఈసారి ప్రభుత్వమే చేపడుతుంది. విద్యార్థులకు మంత్రి బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
Next Story