Thu Dec 18 2025 05:14:01 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని మరోసారి ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం కూడా అదేనని చెప్పారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
మూడు రాజధానులే.....
మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాలని కూడా పేర్కొంది. అయినా బొత్స మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

