Fri Dec 05 2025 23:48:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా ఏపీలో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లో వరసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న పంచాయతీ, నిన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ లో వరసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న పంచాయతీ, నిన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. నేడు మిగిలిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమయింది. రాష్ట్రంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పది జడ్పీటీసీ, 123 ఎంపీీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 954 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
పదమూడు జిల్లాల్లో....
ఈ ఎన్నికల్లో మొత్తం పది జడ్పీటీసీ స్థానాలకు 40 మంది, 123 ఎంపీటీసీ స్థానాలకు 328 మంది పోటీలో ఉణ్నారు. ఈ నెల 18 వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
Next Story

