Thu Dec 18 2025 12:04:21 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను నేడు విడుదలచేస్తామని ఉన్నతవిద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
3.40 లక్షల మంది...
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు కాగా, మరికొందరు ఇంప్రూవ్ మెంట్ కోసం రాసిిన వారున్నారని అధికారులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఎంత మంది ఉత్తీర్ణులయ్యారన్నది వెల్లడి కానుంది.
Next Story

