Sun Mar 08 2026 15:10:21 GMT+0530 (India Standard Time)
తిరుమలలో గవర్నర్
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. గవర్నర్ కు ఆలయం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన గవర్నర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అనంతరం గవర్నర్ కు వేదాశీర్వచనం పండితులు పలికారు.
వేదాశీర్వచనం....
అనంతరం ఈవో గవర్నర్ అబ్దుల్ నజీర్కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

