Sun Dec 14 2025 04:01:37 GMT+0000 (Coordinated Universal Time)
అంగన్ వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
అంగన్ వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

అంగన్ వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్నాడీ వర్కర్ల, హెల్పర్ల అంత్యక్రియలకు పదిహేను వేల రూపాయలు మంజూరు చేయడం ద్వారా ఆ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకాన్ని పొడిగించాలన్నది అంగన్ వాడీ వర్కర్లర ప్రధాన డిమాండ్ గా గత కొంతకాలంగా వినిపిస్తుంది.
ఉత్తర్వులు జారీ చేయడంతో...
ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల కు చెందిన చట్టబద్దమైన వారసులకు ఈ మొత్తం సొమ్మును చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీంతోఅంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.
Next Story

