Sun Mar 15 2026 21:51:41 GMT+0530 (India Standard Time)
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది.

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో ఈ కమాండ్ కంట్రోల్ ఇక పని చేయనుంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్....
తక్షణమే ఈ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడం, ఆక్సిజన్ నిల్లవు, ఐసొలేషన్ కిట్లు, మందుల పంపిణీ వంటివి ఈ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో పదివేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం తక్షణం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది.
Next Story

