Mon Feb 02 2026 13:31:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : స్థానిక సంస్థలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థలకు 548.28 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఈ మేరకు స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్థానిక సంస్థలకు...
ఈ విడుదల చేసిన నిధులను ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మడల పరిషత్, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ను ఆదేశిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులను స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించుకోవడానికి వినియోగించనున్నారు.
Next Story

